షాకింగ్ : చితికి నిప్పంటిస్తుండగా కళ్లు తెరిచిన శవం!

-

ఢిల్లీలో నరేలా ప్రాంతంలో ఆదివారం  ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ చనిపోయిన ఓ వ్యక్తి స్మశాన వాటిక నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు… తిక్రీ ఖుర్దు గ్రామానికి చెందిన 62 సంవత్సరాల పెద్ద సతీష్ భరద్వాజ్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

క్యాన్సర్ కారణంగా ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. వెంటిలేటర్ పై ఖర్చు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకు వెళ్లారు. దీంతో సతీష్ మృతి చెందాడు. అనంతరం ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు. సన్నాహకాలు పూర్తిచేసే స్మశాన వాటికకు తీసుకు వచ్చే సరికి వృద్ధుడి ముఖంలో ఏదో కదలిక రావడం.. మెల్లగా కళ్ళు తెరిచి చూడడం కొందరు చూశారు.

శివానికి నిప్పంటించి ముందు అతడి ముఖం పై ఉన్న ముసుగులు తొలగించి.. నోట్ల తులసి తీర్థంగా గంగా జలాలను పోసారు కుటుంబ సభ్యులు. అంతే ఆ వృద్ధుడు చితిపై ఉన్న శవం అటూ ఇటూ కదలడం తో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ వృద్ధుడు.. చికిత్స పొందుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version