ప్రియుడు కోసం తల్లితో కలిసి కన్న అక్రమ సంబంధం..తండ్రిని చంపేసి.. ప్రియుడితో సెకండ్ షో సినిమాకు వెళ్లిన కూతురు కడతేర్చిన కూతురు..!

-

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపేసి.. ప్రియుడితో సెకండ్ షో సినిమాకు వెళ్ళింది ఓ కూతురు. ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రిని చంపింది కూతురు. హైదరాబాద్–కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం(45) అనే వ్యక్తి ఒక అపార్టుమెంటులో వాచ్మెన్ గా పనిచేస్తుండగా, జీహెచ్ఎంసీలో స్వీపర్ గా పని చేస్తోంది అతని భార్య శారద(40). వారి కూతురు మనీషా(25)కి వివాహం జరగగా, జావీద్(24) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆమెను వదిలేసాడు భర్త.


దీంతో మౌలాలిలోని అద్దె ఇంట్లో ప్రియుడితో కలిసి ఉంటోంది మనీషా. కూతురు వేరే వాళ్లతో కలిసి ఉండడం నచ్చక తరచూ మనీషాతో గొడవ పడుతున్న తండ్రిపై కోపం పెంచుకుంది మనీషా. దింతో ఈ నెల 5వ తేదీన మనీషా ఇచ్చిన నిద్ర మాత్రలు కల్లులో కలిపి భర్తకు ఇచ్చారు మనిషా, శారద. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత లింగం మొహంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు కూతురు మనీషా, ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారద. హత్య అనంతరం ప్రియుడితో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లి సినిమా పూర్తయ్యాక తండ్రి శవాన్ని ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామ చెరువులో పడేసారు. సీసీ కెమెరాల ఆధారంగా కూతురే హత్య చేసిందని నిర్ధారించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news