మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిన నష్టాన్ని వారి నుంచే రాబట్టాలి : బండి సంజయ్

-

కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కృంగిన ఘటనపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కుటుంబమే దీనికి బాధ్యత వహించాలని.. జరిగిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో జమ్మి పూజ చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ కృంగిపోవడం పట్ల దేశ ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. కాలేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చుంటే పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉండేదో అని ప్రశ్నించారు. కమిషన్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ నాణ్యత ప్రమాణ పట్ల లేనందునే కాలేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు బండి సంజయ్. రాజకీయ పార్టీల నేతలు ప్రాజెక్టును సందర్శిస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి రాలేదని నాణ్యతకు తిలోదకాలు వదిలారని విమర్శించారు. ఈ ఘటనపై ఇప్పటికే తమ పార్టీ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బిజెపి అభ్యర్థుల రెండో జాబితాపై స్పందిస్తూ దసరా తర్వాత చర్చించి ప్రకటిస్తామని తెలిపారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version