వినియోగ దారులకు షాక్‌..పెరుగనున్న ఏసీలు, ఫ్రిడ్జ్ లు, సీలింగ్ ఫ్యాన్ల ధరలు

-

దేశంలోని సామాన్య మరియు ఉన్నత వర్గాలకు చెందిన వినియోగ దారులకు షాక్‌ తగులనుంది. మనం నిత్యం వినియోగించే ఏసీలు, ఫ్రిడ్జ్ లు, సీలింగ్ ఫ్యాన్ల ధరలు మరోసారి భారీగా పెరుగనున్నాయి. త్వరలో ఏసీల ధరలు 5-8%, ఫ్రిడ్జ్ ల ధరలు 5%, ఫ్యాన్ల ధరలు 7-8% పెరుగుతాయి.

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కొత్త నిబంధనలు ఈనెల ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం వీటి తయారీలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు 4 స్టార్ కు మారుతాయి. ఫైవ్ స్టార్ ప్రమాణాలతో కొత్త పరికరాలు తయారు కానున్నాయి. దీంతో ధరల పెంపునకు కంపెనీలు సిద్ధమయ్యాయి. ఒక వేళ ఏసీలు, ఫ్రిడ్జ్ లు, సీలింగ్ ఫ్యాన్లు తీసుకునే వారు.. ఇప్పుడే కొనుగోలు చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version