తెలంగాణ ప్రజలకు అలర్ట్..రేపటి నుంచి విపరీతంగా పెరగనున్న ఎండలు

-

తెలంగాణ ప్రజలకు బిగ్‌ అలర్ట్. రేపటి నుంచి విపరీతంగా ఎండలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపింది.

ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41°C నుండి 44°C (డిగ్రీల సెంటీగ్రేడ్) మధ్యన అనేక చోట్ల, రేపు 40°C నుండి 42°C ( కొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించింది. 21వ తేదీ నుండి అంటే రేపటి నుంచే 4,5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి అనేక చోట్ల 40°C కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

GHMC పరిధిలో 21వ తేదీ నుండి 35°C నుండి 37°C మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు, వాయువ్య తెలంగాణ, రేపు తూర్పు తెలంగాణ జిల్లాలలో, ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version