మరో రూ.వెయ్యి కోట్ల అప్పు చేసిన తెలంగాణ సర్కార్ !

-

కేసీఆర్‌ ప్రభుత్వం మరోసారి రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 1,000 కోట్ల రుణం సమకూర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా తీసుకున్న ఈ అప్పును 21,22 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించనుంది. మంగళవారం ఈ వేలం జరిగింది. రూ.1,000 కోట్లతో ఈ ఏడాది అప్పుల మొత్తం రూ. 27,500 కోట్లకు చేరింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 47,500 కోట్లు రుణాల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఏడాది మధ్యలో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన మేరకు ఆ రుణం రూ.39 వేల కోట్లకు తగ్గింది. ఇప్పటికి రూ. 27 వేల కోట్లకు పైగా రుణాలు సమకూరిన నేపథ్యంలో మిగిలిన సుమారు రూ. 12 వేల కోట్ల రుణాలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version