వంద కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

-

అరేయ్ బిడ్డ నేను కేసీఆర్ శిష్యుడిని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మీరు ఇలాంటి వంద కేసులు పెట్టిన కూడా.. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము కేసీఆర్ నాయకత్వంతో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని కాంగ్రెస్కు సవాల్ విసిరారు. ఇంకో సంవత్సరం ఆగితే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కాన్వాయికే అడ్డం తిరుగుతాం.. ఏం చేస్తారో చేసుకోండంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి పై రెండ్రోజుల క్రితం క్రిమినల్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

భారత్ న్యాయ సంహిత చట్టంలో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డినే. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సిఈవో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించారు. దీంతో ఆయనపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టం అమలులోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version