ఊపిరి పీల్చుకుంటున్న ఇండియా ఫ్యాన్స్…సెమీస్ కు ఆ ఐరన్ లెగ్ అంపైర్ లేడు !

-

వరల్డ్ కప్ 2023 లో సొంతగడ్డపై ఎదురులేని టీం గా సెమీస్ కు చేరుకుంది. మొదటి సెమీఫైనల్ లో ఇండియా గత వరల్డ్ కప్ సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇక సెమీస్ కు ముందు చాలా వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక ఇండియాకు వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో ఐరన్ లెగ్ గా పేరున్న అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో.. ఎందుకంటే గత వరల్డ్ కప్ 2019 లో కివీస్ తో జరుగుతున్న సెమి ఫైనల్ లో క్లిష్టమైన సమయంలో ధోని రన్ అవుట్ అవడంతో ఇతను వెలుగులోకి వచ్చాడు. ఈ రన్ అవుట్ వలన ఇండియా సెమి ఫైనల్ లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా మోస్ట్ లీ కెటిల్ బరో కీలక మ్యాచ్ లకు అంపైర్ గా ఉంటాడు. కానీ ఈసారి మాత్రం ఇండియా ఆడనున్న సెమీఫైనల్ లో అంపైర్ గా ఇతను లేడు..

ఆన్ ఫీల్డ్ అంపైర్లు గా రిచర్డ్ కిల్లింగ్ వర్త్ మరియు రాడ్ టక్కర్ లు చేయనుండగా, థర్డ్ అంపైర్ గా జోయెల్ విల్సన్ చేస్తున్నారు. దీనితో ఇండియన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.. అదే విధంగా ఈసారి కప్ మనదే అంటూ జోష్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version