గత ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదు.. పవన్ కీలక వ్యాఖ్యలు

-

తాను డిప్యూటీ సీఎం అవుతానని అస్సలు అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సత్కార కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు. వారాహి దీక్షను విరమించిన తరువాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా మాట్లాడారు. జనసేన 21 సీట్లలో గెలిచిందంటే ఇది చాలా పెద్ద పెద్ద విషయం అన్నారు. గత ప్రభుత్వంలో ప్రశ్నించాలంటే భయపడే పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదు.

జనసేనకు 20 శాతం ఓటింగ్ పెరిగింది.  ఎంత సాధించినా.. తగ్గి ఉండటం అనేది చాలా ముఖ్యం. దేశంలో మన విజయం కేస్ స్టడీ. కూటమి విజయానికి మనం తీసుకున్న నిర్ఱయమే కీలకం అన్నారు. కూటమి సాధించిన విజయం మాజీ సీఎం జగన్ కి భయం ఏర్పడింది అన్నారు. తనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడానికి మీరే కారణమని పేర్కొన్నారు. మున్ముందు కూడా జనసేన ఇలాంటి విజయాలను సాధిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version