జగన్ కి ఇవే చివరి ఎన్నికలు : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. నామినేషన్ల పర్వం ఒకవైపు, నేతల ప్రచారం ఒకవైపు వెరసి ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. రాజకీయ నాయకులు ఒక్కరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో చేసుకుంటుండడంతో రాష్ట్రం హోరెత్తుతోంది.ఆముదాలవలసలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా, జగన్ ను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.

చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా అప్పుగా ఇచ్చారని, తల్లిదండ్రుల వాటా కూడా చెల్లికి ఇవ్వాల్సింది పోయి, అప్పుగా ఎవరైనా ఇస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కు ఇవే చివరి ఎన్నికలు కావాలని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు. తన హయాంలో అమలు చేసిన డ్వాక్రా సంఘాలు, దీపం వంటి పథకాలను గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version