మరో వివాదంలో నయనతార దంపతులు… కేసు నమోదు !

-

కోలీవుడ్ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విఘ్నేష్ ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా పెళ్లి అయినప్పటి నుండి ఇద్దరూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని కేసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం మళ్ళీ ఇంకో సమస్యలు ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారట. వీరిపై కేసు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలలోకి వెళితే… విఘ్నేష్ శివన్ తండ్రి శివ కొలుదు కొంతకాలం క్రిందటే ఆరోగ్య సమస్యలతో మరణించడం జరిగింది. కాగా ఈయన బతికి ఉన్న సమయంలో ఉమ్మడిగా ఉన్న ఆస్తిని తోటి సోదరులకు తెలియయకుండా మోసం చేసి ఇతరులకు అమ్ముకున్నాడని ఆయన సోదరులు ఇప్పుడు ఆరోపించారు. ఆయన బ్రతికి లేడు కాబట్టి కుటుంబ సభ్యులు అయిన విఘ్నేష్ శివన్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులపై తిరుచ్చి లో కేసు పెట్టారట.

కాగా పోలీసులు కేసును తీసుకుని నమోదు చేసి విచారణ నిమిత్తం విఘ్నేష్ దంపతులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version