తిరుమల శ్రీవారి హుండీ కొత్త రికార్డు..చరిత్రలోనే ఇదే తొలిసారి

-

తిరుమల శ్రీవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా తిరుమల శ్రీవారి దేవాలయానికి పేరు ఉంది. అయితే, ఈ నేపథ్యంలోనే, తిరుమల శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది.

 

టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనంత హుండీ ఆదాయం సమకూరింది. వైకుంఠ ఏకాదశి కావడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలో భక్తులు హుండీలలో స్వామి వారికి సమర్పించిన కానుకలను లెక్కించగా ఏకంగా రూ. 7.68 కోట్లు వచ్చింది. ఇది ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version