నేడు బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం..ప్రధాని కీలక ప్రసంగం

-

నేడు బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం జరుగనుంది. ఈ తరుణంలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరుగనున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు పార్టీ జెండా ను ఎగరవేయనున్నారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అంతేకాదు.. ఉదయం 10 గంటలకు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు  ప్రధాని మోడీ. అనంతరం పార్లమెంట్ లైబ్రరీ భవనంలోనూ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీకి చెందిన ఉభయ సభల ఎమ్.పిలు పాల్గొననున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version