ఏపీ రైతులకు శుభవార్త..రేపు వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల

-

ఏపీ రైతులకు శుభవార్త. రేపు వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. ఇందులో భాగంగానే, రేపు సీఎం వైఎస్‌ జగన్‌… గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ మేరకు నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభిస్తారు సీఎం జగన్‌.

cm jagan

ఇందులో భాగంగానే, రేపు ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరినున్న ముఖ్యమంత్రి జగన్‌…. ఉదయం10.35 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్ లో భాగంగా వర్చువల్ గా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఇక రేపు మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version