హృదయాలను తాకేలా.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న సాయి పల్లవి.. వీడియో వైరల్..!!

-

నాచురల్ స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈమె ఎంచుకునే ప్రతి పాత్ర కూడా చాలా సెలెక్టివ్ గా ఉండడంతో పాటు ఎంత పెద్ద స్టార్ హీరో వచ్చినా సరే తనకు ఇష్టం లేని పాత్రలో చేయడానికి ససేమిరా చెబుతూ ఉంటుంది. అందుకే అభిమానులు ఈమెకు లేడీ పవర్ స్టార్ అంటూ కితాబు కూడా ఇచ్చారు ముఖ్యంగా గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకునే అతి తక్కువ మంది హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు. ఇప్పటివరకు ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి.

సాంప్రదాయమైన చీరకట్టులో సినిమా ప్రమోషన్లకు విచ్చేస్తూ దివంగత హీరోయిన్ సౌందర్యను తలపిస్తుంది అనడంలో సందేహం లేదు.. ముఖ్యంగా విరాటపర్వం, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో అలరించిన సాయి పల్లవి చివరిసారిగా గార్గి చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాల్లో ఆమె నటనకు సినీ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె మరొక ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. తన కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కొద్ది రోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసిన సాయి పల్లవి.. ఇప్పుడు హృదయాలను హత్తుకునేలా.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వీడియో రూపంలో బంధించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఈ వీడియోలో పచ్చని ప్రకృతిని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తోంది సాయి పల్లవి.. చుట్టూ కొండలు..అడవి.. జలపాతాల మధ్య తన తల్లిదండ్రులు , చెల్లెలితో కలిసి సరదాగా గడిపేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పలు రకాలుగా స్పందించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version