కూకట్‌పల్లిలో ట్రాన్స్ జెండర్‌ మృతదేహం లభ్యం

-

హైదరాబాద్‌ లోని కూకట్ పల్లి లో విషాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లి కే.పి.హెచ్.బి 4వ ఫేస్ చెట్ల పొదల్లో నిన్న సాయంత్రం ట్రాన్స్ జెండర్ మృతదేహం లభ్యం అయింది.

కూకట్ పల్లి కే.పి.హెచ్.బి 4వ ఫేస్ మజీద్ సమీపంలోని చెట్ల పొదల్లో సుమారు 45 ఏళ్లున్న గుర్తు తెలియని ట్రాన్స్ జెండర్ మృతదేహన్ని చూసి పోలీసులకు సమచారం అందించారు స్థానికులు.

ఇక సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎవరైనా హత్య చేశారా, ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version