ట్రిపుల్ తలాక్ ప్రమాదకరం.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

-

ఇస్లాం మతంలోని ట్రిపుల్ తలాక్ ఆచారం ముస్లిం మహిళల యొక్క పరిస్తితిని దయనీయంగా మార్చిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిడ్ కూడా దాఖలు చేసింది. ట్రిపుల్ తలాక్ ఆచారం వివాహం అనే సామాజిక సంప్రదాయానికి ప్రమాదకరంగా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్ లో వివరించింది.

2017లో సుప్రీం కోర్టు  ఈ ఆచారాన్ని రాజ్యాంగ విరుద్దమని పేర్కొందని.. అయినా కొంత మంది ముస్లింలలో ఇప్పటికీ ఆచారం కొనసాగుతుందని అఫిడవిట్ ద్వారా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అందువల్ల ముస్లింలలో ట్రిపుల్ తలాక్ విడాకుల సంఖ్యను తగ్గించడంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రతిబంధకంగా పని చేయలేదని తెలిపింది. ట్రిపుల్ తలాక్ బాధితులు పోలీసులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకపోవడం.. చట్టంలో శిక్షార్హమైన నిబంధనలు లేకపోవడంతో భర్తలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా నిరోధించుకునేందుకు కఠినమైన నిబంధనల అవసరముందని వాదించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version