బుల్లితెర నటుడికి కరోనా పాజిటివ్..! ఆందోళనలో టీవీ యాక్టర్స్…!

-

తెలంగాణలో కరోనా వైరస్ భారీగా విజృంభిస్తుంది. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ తన వశం చేసుకుంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఎవ్వరూ సరిగ్గా నిదుర పోవడం లేదు. ప్రతీ నిమిషం ఓ కొత్త కేసు ప్రతీ నిమిషం ఓ కొత్త టెన్షన్. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఈ మహమ్మారిని అరికట్టలేకపోతున్నారు. ఏదో ఒక తావు చేసుకొని వ్యాప్తి చెందుతుంది. ఎన్నో జాగ్రత్తలు పాటించే రాజకీయ నేతలు నటులు కూడా ఈ మహమ్మారి బారిన పడక తప్పడం లేదు. కాగా తాజాగా సీరియల్ యాక్టర్ సాక్షిశివకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే టీవీ నటులు ప్రభాకర్‌, హరికృష్ణ, నవ్యకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరగడంతో టీవీ నటుల్లో ఆందోళన మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version