చికోటి లిస్ట్ లో మెదక్ జిల్లా రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు

-

ఉమ్మడి మెదక్ జిల్లాలో చికోటి వ్యవహారంలో డొంక కదులుతోంది. చికోటి లిస్ట్ లో మెదక్ జిల్లా రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. హరిత హోటల్ లో చక్రపాణి అనే వ్యక్తి TRS నేత అశోక్ సోదరుడు రూమ్స్ బుక్ చేయగా.. బర్త్ డే పార్టీకి మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కొడుకు రాము హాజరయ్యాడు.

జిల్లా నేతలతో కలిసి గోవా టూర్ కి ఏడుపాయల ఆలయ ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ వెళ్లాడు. అయితే.. గోవాకి వెళ్ళినప్పుడు నేతలకు పరిచయమయ్యాడు చికోటి ప్రభాకర్‌. బర్త్ డే పార్టీ ఏడుపాయలలో చేసుకుందామని చీకోటిని ఆహ్వానించారు జిల్లా నేతలు, వ్యాపారులు. ఈ నెల 19 న చికోటి బర్త్ డే జరిగింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హరిత హోటల్లో చికోటి బర్త్ డే పార్టీ జరుగగా.. 2 బ్యాంక్వేట్ హాల్స్, 6 గదులు బుక్ చేసుకున్నారు నేతలు. ఒక్కొక్కటిగా పేర్లు బయటికి రావడంతో మెదక్ జిల్లా నేతల్లో తమ పేర్లు ఎక్కడికి బయటికి వస్తాయేమోనని అన్న భయంలో కొంత మంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version