ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్.. 44 బిలియన్ డాలర్ల డీల్ ఒకే

-

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ అంతర్జాతీయ సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. తాజాగా 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు మస్క్. ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన ఆయన… 2 వారాల క్రితం ఆసంస్థ లో 9 శాతం వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటన చేశారు.

ప్రస్తుతం సంస్థ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు ఎలాన్ మాస్క్. కొనుగోలు ఒప్పందం గురించి మస్క్ తో ట్విట్టర్ బోర్డు కొన్నాళ్లుగా విస్తృత చర్చలు జరుపుతోంది. ఒక్కో షేరు 54 డాలర్ల చొప్పున మొత్తం 46 బులియన్ డాలర్లతో ఫిల్టర్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమని మస్కు గతవారం ప్రకటించారు. వాక్ స్వాతంత్రానికి.. మరింత అనువైన వేదికగా దాన్ని తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటన చేశారు. కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో ట్విట్టర్ షేర్ సోమవారం 3 శాతానికి పెరిగింది. ట్విట్టర్ కొనుగోలు నిధులను బ్యాంకుల ద్వారా మస్క్ సమకూర్చుకున్న ట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version