నేడు 3 టిమ్స్‌ల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

-

హైదరాబాద్‌లో 3 టిమ్స్‌ ఆసుపత్రులను నిర్మించబోతున్నట్లు తెలంగాణ సర్కార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్‌ 3 ప్రాంతాల్లో నూతనంగా నిర్మించబోతున్న టిమ్స్‌ ఆసుపత్రులకు శంకుస్థాపన చేయనున్నారు. నగరంలోని సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌, అల్వాల్‌లలో టిమ్స్‌ ఆసుపత్రులకు సీఎం కేసీఆర్‌ పునాది రాళ్లు వేయనున్నారు. అధునాతన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు ఎల్బీనగర్‌, సనత్‌ నగర్‌, అల్వాల్‌ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

అంతేకాకుండా సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కూడా త్వరలోనే జరుగుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు వెల్లడించారు. అయితే ఉదయం 11 గంటలకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ ప్రాంతంలో నిర్మించే ఆస్పత్రికి భూమి పూజ చేసిన అనంతరం ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించబోయే ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. తర్వాత ఆల్వాల్‌కు చేరుకుని మరో భూమి చేసి, అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version