48 గంటల్లో లాతూర్-నాందేడ్ హైవేపై రెండు ప్రమాదాలు

-

మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ రహదారిపై 48 గంటల్లో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.హైవే మధ్యలో నుంచి రోడ్ క్రాస్ చేసే క్రమంలో ఎటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. నిన్న మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవేపై ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో 36 మందికి తీవ్ర గాయాలు అవ్వగా..ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తాజాగా అదే ప్రదేశంలో బైకర్ రోడ్ క్రాస్ చేస్తుండగా.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ గాల్లోకి ఎగిరి డివైడర్ మధ్యలోంచి పక్కనున్న రోడ్డుపై పడిపోగా.. కారు డివైడర్ మధ్యంలోని మట్టిలో కూరుకుపోయింది. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. అక్కడ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news