Breaking : తెలంగాణలో రెండు రోజులు స్కూళ్లు బంద్‌..

-

ఈనెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేదుకు టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే గ్రూప్‌-2 పరీక్షల కోసం కేటాయించిన పాఠశాలలకు 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

ఇందుకు సంబంధించిన చ‌ర్యలు తీసుకోవాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్టర్ దేవ‌సేన‌ తాజాగా జిల్లా విద్యాధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల‌కు 5,51,943 మంది ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు. రెండు రోజుల్లో నాలుగు పేప‌ర్లకు ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ప‌రీక్షకు వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచ‌నున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version