ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ హైకోర్టు కొత్త సీజే

-

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉజ్జల్‌ భూయాన్‌తో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర సీఎం కేసీఆర్‌ హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల ఆమోదించగా.. గతవారం కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది. అసోంకు చెందిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 2011 అక్టోబర్‌ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version