మమ్మల్ని వెనకుండి నడిపించిన ‘కాకా’ : మంత్రి పొన్నం

-

దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత వెంకట్ స్వామి 95వ జయంతి వేడుకలను నగరంలోని ట్యాంక్ బండ్‌పై ప్రభుత్వం నిర్వహిస్తోంది.ఈ క్రమంలోనే వెంకటస్వామి విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు వివేక్ ,వినోద్‌లు నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ పంచుకున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలను, ప్రజాస్వామ్య విలువలను ఏ విధంగా పరిష్కరించరించలేని అంశాలను కూడా అవలీలగా అధిగమించిన నేత వెంకట్ స్వామి ఆయన సేవలను కొనియాడారు.

NSUI నేతగా ఉన్నప్పటి నుంచి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని వెనుకుండి నడిపించారని చెప్పారు.సహకార సంఘాల్లో కూడా మాకు అండగా నిలిచారని తెలిపారు.కాకా ఆలోచనలు ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీల కోసం అహర్నిశలు కృషి చేశారని వెల్లడించారు. బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు వారి గొంతుగా మేమంతా ముందుకు వెళ్తున్నామన్నారు. వెంకటస్వామి వారసులు వివేక్, వినోద్ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. మున్ముందు వెంకట్ స్వామి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని మంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version