నాకు క్షమాపణ చెప్పే వరకు వదిలి పెట్టను..కొండా సురేఖకు కేటీఆర్ వార్నింగ్

-

తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ మంత్రి కొండా సురేఖ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేసింది కొండా సురేఖ. దీంతో కేటీఆర్ కొండా సురేఖ పై పరువు నష్టం దావా కూడా వేసినట్టు సమాచారం. తాజాగా ఇవాళ కందుకూరులో మీడియాతో మాట్లాడుతూ చెప్పలేని రీతిలో సీఎం, మంత్రులు మాట్లాడు తున్నారు. నాపై ఇష్టం వచ్చినట్లు మంత్రులు మాట్లాడుతున్నారు.

నోటి నిండా గబ్బుతో మాట్లాడు తున్నారు. నా గురించి చెప్పలేని విదంగా ఓ మంత్రి మాట్లాడారు. ఇప్పటికే పరువు నష్టం దావా వేశాను. నాకు క్షమాపణ చెప్పే వరకు వదిలి పెట్టను. ఎంత వరకు వెళ్లి అయినా తేల్చుకుంటాం. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్నారు. మా మీద కోపం ఉంటే మా ఇండ్లు కూల్చoడి.. కానీ పేదల దగ్గరకు రావద్దు. మా ఇండ్లు కూలగొట్టి అప్పటితో అయినా, ఈ కూల్చివేతలు ఆపేయండని సూచించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version