మోదీ సుపరిపాలన ఏపీలో రానుంది – కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

-

మోదీ సుపరిపాలన… ఏపీలో రానుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ దుర్గమ్మను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు స్వాగతం పలికారు ఆలయ అధికారులు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపి లో మంచి ప్రభుత్వం రావాల్సి వుంది.. గతంలో టిడిపి, ప్రస్తుత వైసిపి పాలన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొ న్నారు.

జవాబు దారీ ప్రభుత్వం, ప్రజా రంజకంగా పాలన అందించే ప్రభుత్వం త్వరలోనే ఏపిలో వస్తుందని చెప్పారు. మోదీ సుపరిపాలన, ఏపిలో రానుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన బిజేపి అందిస్తుందని వివరించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. మోడీకి ఏపీలో మంచి ఆదరణ ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version