నేడు బెంగళూరుతో యూపీ వారియర్స్ ఢీ

-

WPL-2024లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, యూపీ వారియర్జ్ జట్ల మధ్య మ్యాచ్  జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఆట ఆరంభమవుతుంది. బెంగళూరు జట్టుకు స్మృతి మందాన, యూపీ టీమ్కి అలీసా హేలీ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛానెల్‌లలో చూడవచ్చు . Jio యాప్‌లో మొబైల్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.నిన్న జరిగిన మ్యాచులో ఢిల్లీపై ముంబై గెలుపొందిన సంగతి తెలిసిందే.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు :

స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లిస్ పెర్రీ, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రేణుకా సింగ్ ఠాకూర్, ప్రీతి బోస్, ఆశా శోభన,నాడిన్ డి క్లర్క్, రాంకా పాటిల్, మేగన్ షుట్.

యూపీ వారియర్స్:

అలిస్సా హీలీ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), వృందా దినేష్, చమరి అటపట్టు, తహ్లియా మెగ్రత్,శ్వేతా షెరావత్, కిరణ్ నవగిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, సైమా ఠాకోర్,అంజలి సర్వాణి, పార్శ్విచోప్రా.

Read more RELATED
Recommended to you

Exit mobile version