వైసీపీ నేతలు, వాలంటీర్లే ‎కాలకేయులు : వంగలపూడి అనిత

-

వైసీపీ నేతలు, వాలంటీర్లే ‎కాలకేయులు అని నిప్పులు చెరిగారు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. నాడు మద్యపాన నిషేదమన్న జగన్.. ఇప్పుడు టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మిస్తున్నారు…మహిళలపై రోజూ దారుణాలు జరుగుతున్నా.. జగన్ మాత్రం నేను సీఎంను కాదు, నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారనీ మండిపడ్డారు. వైసీపీ నేతలు, వాలంటీర్లే ‎కాలకేయుల్లా.. మారి మహిళలపై అత్యాచారాలు, దాడులకు తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు.

వైసీపీ 3 ఏళ్ల పాలనపై ‎కేకులు కట్ చేస్తున్న వైసీపీ నేతలంతా.. జగన్ పాలనలో తమ ఇంట్లో ‎మహిళలకు ఎంత భద్రత ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని చురకలు అంటించారు.ఎన్నికలకు మందు అందరికీ అమ్మ ఒడి ఇస్తామని చెప్పిన భారతి.. అమ్మ ఒడిని ఒక్కరికే పరిమితం చేస్తే ఎందుకు మాట్లాడటం లేదు..?

ఒకటి రెండు రేపులకే రాద్దాంతమా అని మంత్రి రోజా అనటం సిగ్గుచేటు అని ఆగ్రహించారు. అత్యాచారాలను ఈజీగా తీసుకునే మానసిక స్దైర్యం రోజాకు ఉన్నంతగా ప్రపంచంలో ఏ మహిళలకు ఉండదన్నారు.ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా.. సీఎం నోరు మెదపటం లేదంటే ఆయన కెబినెట్లో ఉన్న మహిళా మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version