ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ – పిచ్చ సీరియస్ ఐన జగన్ – పరిగెత్తిన అధికారులు !!

-

ఏపీ మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ అవ్వటం ఇప్పుడు రాష్ట్రంలో బ్రేకింగ్ న్యూస్ గా మారింది. సంతకం ఒకటే వాటర్ ఈ కాకుండా లెటర్ హెడ్ తో సహా ఫోర్జరీ అవటంతో మంత్రి తానేటి వనిత ఫుల్ సీరియస్ అవుతున్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఈ వ్యవహారంపై రాష్ట్ర డిజిపి కి మరియు హోంమంత్రి సుచరిత లకు ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్ తో పాటు మరియు సంతకాన్ని ఫోర్జరీ చేయడం పై చట్టపరమైన చర్యలు చాలా సీరియస్ గా తీసుకోవాలని మంత్రి తానేటి వనిత కోరడం జరిగింది.

అయితే ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లడంతో పిచ్చ సీరియస్ అయ్యారట. ఒక మంత్రి అయ్యుండి ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉంటున్నారని గట్టి గట్టిగా ఈ విషయంపై కేకలు వేయడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ అధికారులు పరిగెత్తినట్టు ప్రభుత్వ వర్గాల్లో వినబడుతున్న టాక్. ఇటువంటి సీరియస్ విషయంలో అందుతున్న సమాచారం ప్రకారం రెడ్డప్ప అనే వ్యక్తి మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ చేసి లెటర్ హెడ్ పై కలెక్టర్ కి మంత్రి తరపున సిఫార్సు చేసినట్లు ఒక లెటర్ రాసినట్లు అసైన్డ్ భూముల కేటాయించాలి అన్నట్లుగా వ్యవహరించడంతో ఈ బాగోతం అంతా బయట పడినట్లు వార్తలు వస్తున్నాయి.

 

కాగా మంత్రి తానేటి వనిత సంతకం తప్పుగా చేయడంతో రెడ్డప్ప అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రెడ్డప్ప అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వాడని ప్రభుత్వ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త ప్రభుత్వ వర్గాల్లో ఏపీ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version