బొండా ఉమ, చంద్రబాబు ఇద్దరు కాలకేయులు – వాసిరెడ్డి పద్మ

-

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని… అటువంటి కాలకేయులకు చంద్రబాబు నాయకుడని చురకలు అంటించారు ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. మహిళా చైర్‌ పర్సన్‌గా నా పదవి పోయే వరకు పోరాడతానని చెబుతున్న చిల్లర రౌడీ బోండా ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపాడా? అని నిలదీశారు.

ఈ నెల 27న మహిళా కమిషన్ ముందుకు రావడానికి చంద్రబాబు, బోండా ఉమకు భయమేంటి? కమిషన్ ముందు హాజరయ్యే ధైర్యం మీకు లేదా? అని తెలిపారు. బోండా ఉమ ఆకు రౌడీ అనుకున్నా.. కానీ మరీ చిల్లర రౌడీలా వ్యవహరిస్తున్నాడు.. బోండా ఉమ వల్ల చంద్రబాబుకు చెడ్డ పేరొచ్చిందని టీడీపీ వాళ్లే తిడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ వాళ్లే తిడుతుండటంతో బోండా ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈ నెల 27న చంద్రబాబు, బోండా ఉమ వచ్చి మహిళా కమిషన్‌కు వివరణ ఇవ్వాల్సిందే అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version