బోండా ఉమా పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం..!

-

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు బుద్దే లేదు అని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ, బోండా ఉమాపై మండిపడ్డారు. ప్రధానంగా చంద్రబాబు చేసిన దిక్కుమాలిన పనికి రాష్ట్రంలో ఉన్న పెన్షనారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కండ్రిక 64 డివిజన్ వైఎస్సార్ సీపీకి కంచుకోట అన్నారు. రూరల్ ప్రాంతమైనా సరే అభివృద్ధి విషయంలో ముందే ఉంది. డివిజన్లోని చిన్న చిన్న సమస్యలపై శాశ్వత పరిష్కారానికి కృషి.

దుర్మార్గుడు చంద్రబాబు చేసిన పనికి అవ్వతాతలు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో పెన్షన్ దారులు సురు చంద్రబాబుకు తగులుతుందన్నారు. చంద్రబాబు పరాకాష్టానికి రోజులు దగ్గరపడ్డాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలపరిచింది సీఎం జగనే. వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎలక్షన్ కమిషన్కు టీడీపీ నేతలే ఫిర్యాదు చేశారు. మళ్లీ ఎందుకు బోండా ఉమా ఈ నాటకాలు ఆడుతున్నాడు. తాగుబోతు బోండా ఉమా ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు.
బోండా ఉమా గజినీలా తయారయ్యాడు. రాత్రి చెప్పినవి పొద్దునకి మర్చిపోతున్నాడు. సెంటర్ లో బోండా ఉమాకు ఓటమి ఖాయమని తెలుసు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version