భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమం కావాలి: వెంకయ్య

-

తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి కోసం ప్రజా ఉద్యమం కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖలో నిర్వహించిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను చాటుకునేందుకు సంఘటితంగా ముందు సాగుదామని..మన భాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడంతో పాటు ఇతరుల భాషా సంస్కృతులను గౌరవిద్దామని తెలిపారు.

మనుషులనే గాక, తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందని.. ఆచార వ్యవహారాలు, భాష సంస్కృతులను పునరుజ్జీవింపజేసుకోవాలని పేర్కొన్నారు. తెలుగు సమాజ నిర్మాణం కోసం రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇతర భాషల్లోకి తెలుగు సాహిత్యాన్ని అనువదించడం మీద ప్రభుత్వాలు, భాషా సంస్థలు చొరవ తీసుకోవాలని వెల్లడించారు. భాషతో, సాంకేతికతను అనుసంధానం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version