హీరో నాగార్జున‌కు ఛాలెంజ్ విసిరిన‌ విజయసాయిరెడ్డి..!

-

పచ్చదనాన్ని పెంచడం కోసం తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. అన్నివర్గాల జనాన్ని ఆకట్టుకుంటూ దిగ్విజయంగా కొనసాగుతోంది. కేంద్రమంత్రులు, పలురంగాల ప్రముఖులు మొదలుకొని సామాన్యజనం వరకు అన్ని వర్గాలు గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వాములవుతున్నారు. ఇక తాజాగా ఈ చాలెంజ్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వీకరించారు. చాలెంజ్ లో భాగంగా విశాఖలోని పెద రిషికొండ జీవీఎంసీ పార్క్ లో మూడు మొక్కలు నాటారు.

ఆపై చాలెంజ్ లో భాగంగా సినీ నటుడు అక్కినేని నాగార్జునను నామినేట్ చేశారు. నాగార్జున‌తో పాటు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, జీవీఎంసీ సిబ్బందిని నామినేట్ చేశారు. కాగా, దీనిపై టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version