ప్రజలకు బిగ్ షాక్..రేపటి నుంచే పెరగనున్న విజయపాల ధరలు

-

తెలుగు రాష్ట్రాల సామాన్య ప్రజలపై మరో భారం పడనుంది. ఎల్లుండి నుంచి పాల ధరలు పెరుగనున్నాయి. విజయ ఫుల్ క్రీమ్, గోల్డ్ పాల ధర లీటర్ కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణ మిల్క్ యూనియన్ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి అంటే రేపటి నుంచే నూతన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ప్రస్తుతం విజయ ఫుల్ క్రీమ్ అర లీటర్ రూ.34 ఉండగా, రూ. 35కు గోల్డ్ ప్యాకెట్ అర లీటర్ రూ. 35 ఉండగా, రూ.36కు విక్రయిస్తామని తెలిపింది. రవాణా, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది.

అటు ఇప్పటికే.. అమూల్‌, హెరిటేజ్ పాల ధరలు ఇటీవలే పెరిగిన సంగతి తెలిసిందే. వీటి ధరలు పెరిగిన నెల రోజుల వ్యవధిలోనే.. విజయ ఫుల్ క్రీమ్, గోల్డ్ పాల ధర లీటర్ కు రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణ మిల్క్ యూనియన్ ప్రకటించింది. కాగా.. రేపటి నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version