“వైఎస్” మంత్రుల‌కు విజ‌య‌మ్మ ఆహ్వానం..!

-

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వారికి వైఎస్ విజ‌య‌మ్మ ఆహ్వానం ప‌లికారు. వైఎస్ ఆర్ 12వ వ‌ర్థంతి సంధ‌ర్బంగా విజ‌య‌మ‌మ్మ హైద‌రాబాద్ లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ హ‌యాంలో మంత్రులుగా ప‌నిచేసిన నేత‌లంద‌రికీ వైఎస్ విజ‌యమ్మ ఆహ్వానం ప‌లికారు.

ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వ్వాలంటూ కేవీపీ రామ‌చంద్రారావు, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్, మాజీ పీసీసీ అధ్య‌క్ష‌డు డి. శ్రీనివాస్, మాజీ స్పీక‌ర్ కేఆర్. సురేష్ రెడ్డిని ఆహ్వానించారు. ఇక వైఎస్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి వైఎస్ ష‌ర్మిల కూడా హాజ‌ర‌వుతున్నార‌ని తెలుస్తోంది. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తారా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version