ఏపీలో మరో దారుణం : మహిళా ఎస్సై ఆత్మహత్య

-

ఏపీ లో మరో దారుణం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకుంది. విజనగరంలోని పోలీస్‌ శిక్షణ కళాశాల సంస్థ క్వార్టర్స్‌ లో శనివారం అర్ధరాత్రి దాటిన అనంతరం మహిళా ఎస్‌ఐ కె, భవాని (25 ) ఫ్యాన్‌ కు ఉరేసుకుని సుసైడ్‌ చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెలితే.. తూ. గో జిల్లా సఖినేటి పల్లి లో ఎస్‌ ఐ గా పని చేస్తున్న భవాని క్రైమ్‌ శిక్షణ నిమిత్తం ఐదు రోజుల కిందట విజయ నగర్‌ వచ్చింది.

శనివారం మధ్యాహ్నానికి శిక్షణ పూర్తి అయింది. ఆదివారం ఆమె తిరిగా వెళ్లిపోవాల్సి ఉంది. ఈమె స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామం. విశాఖ లో ఉన్న సోదరుడు శివ కు చివరి సారి ఫోన్‌ చేసి… శిక్షణ పూర్తయిపోయినట్లు చెప్పిందని తెలిపింది. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక అటు విజయనగరం పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version