కన్నకొడుకుని మానసికంగా హింసించి చంపిన క్రూరుడు – విజయసాయి రెడ్డి

-

కన్నకొడుకుని మానసికంగా హింసించి చంపిన క్రూరుడు అని ఈనాడు రామోజీ రావు పై మరో వివాదాస్పద ట్వీట్ చేశారు వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి. ఒంట్లో కేన్సర్ ను జయించగలను గానీ ఇంట్లో కేన్సర్ తో పోరాడలేనని సుమన్ చెప్పాడుగా! కన్నకొడుకుని అందరిలో పదేపదే అవమానించి మానసికంగా హింసించి చంపిన క్రూరుడు! ఎన్టీఆర్ కు కలిగించిన క్షోభనే కన్న కొడుక్కీ కలిగించిన దుష్టుడు రాచపుండు రాము అని ఫైర్ అయ్యారు.


టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని చురకలు అంటించారు. రాష్ట్రాన్ని నెలకోసారి సందర్శించే టూరిస్టులు. రాజధాని మేం చెప్పిన చోటే ఉండాలి. వికేంద్రీకరణ ఎలా చేస్తారు…అంటూ వితండ వాదన చేస్తారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలతో వారికి పని లేదు. 29 గ్రామాల్లో వాళ్ళు కొన్న ఆస్తుల కోసమే ఈ తాపత్రయం అని చెప్పారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version