బిగ్ బ్రేకింగ్: విజయమాల్యాకు ఫోన్ చేసిన చంద్రబాబు!

-

రాజకీయాల్లో విమర్శలూ ప్రతి విమర్శలూ అందరూ చేస్తారు కానీ… పొలిటికల్ సెటైర్లు, ఎక్కడో మండిపోయే మాటలు అందరూ మాట్లాడలేరు. ఈ విషయంలో వైపాకా నుంచి ఆఫ్ లైన్ లో కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని మొదలైన వారు పోటీపడుతుంటుండగా… ఆన్ లైన్ లో మాత్రం విజయసాయి రెడ్డి ఫస్ట్ ప్లేస్ సంపాదించుకోవడంలో సక్సెస్ అవుతూనే ఉంటున్నారు. తాజాగా మరోసారి ట్విట్టర్ లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు!

నిన్నమొన్నటివరకూ చంద్రబాబు – లోకేష్ లపై తీవ్రస్థాయిలో, రెండు మూడు రోజులుగా రామ్మోహన్ పై మరింత తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్న విజయసాయి రెడ్డి… మరోసారి చంద్రబాబు పై వెటకారాస్త్రాలను సంధించారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి నెలకొన్న పరిస్తితుల దుష్ట్యా… “ఇప్పుడే విన్నాను… అదేమిటంటే… చంద్రబాబు నాయుడు లండన్ పారిపోయి దాక్కొన్న తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక వ్యాపారవేత్తకు ఫోన్ చేశారట.. ఇండియా నుంచి పారిపోవడానికి ఉన్న మంచి మార్గం చెప్పమని అడిగారట..” అని విజయసాయి ట్వీట్ పెట్టారు.

ఇప్పుడు ఆ ట్వీట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. ఇక్కడ లండన్ లో దాక్కొన్న ఇండస్ట్రియలిస్ట్ అంటే… అది విజయమాల్యానే అయ్యి ఉండొచ్చని ఆన్ లైన్ జనాలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. కాగా… గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఒకపక్క ఏసీబీ, మరోపక్క సీబీఐ లతో జగన్ విచారణలు చేయిస్తున్న సంగతి తెలిసిందే!

కాగా… గతంలో ముఖ్యమంత్రి హోదాలో లండన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. అక్కడ విజయమాల్యాను కలిశారని, పార్టీకోసం రూ. 150 కోట్లు విరాళం తీసుకున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నాడు చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version