Kamal Haasan: ‘విక్రమ్’ ప్రమోషన్స్ స్టార్ట్..కపిల్ శర్మ షోలో కమల్ హాసన్

-

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. ‘ఖైదీ, మాస్టర్’ ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 3న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమెషన్స్ స్టార్ట్ చేశారు.

ఈ నెల 15న ట్రైలర్ రిలీజ్ కానుంది. కాగా, ఈ సినిమా విడుదలకు ముందే మేకర్స్ కు ప్రాఫిట్స్ లభించడం విశేషం. సినిమా మేకింగ్ కు రూ.100 కోట్లు అయినట్లు టాక్.. రాగా, సినిమా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ కు రూ.125 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ పిక్చర్ పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో విడుదల కానుంది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఈ పిక్చర్ ప్రమోషన్స్ తొలుత స్టార్ట్ చేశారు లోకనాయకుడు కమల్. ‘ద కపిల్ శర్మ’ షోలో పార్టిసిపేట్ చేసి చిత్ర విశేషాలు పంచుకున్నారు కమల్ హాసన్. ఈ సందర్భంగా కమల్ హాసన్ తో దిగిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు కపిల్ శర్మ.

‘విక్రమ్’ చిత్రం డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని, కమల్ హాసన్ తో టైం స్పెండ్ చేసే చాన్స్ తనకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు కపిల్ శర్మ. కమల్ హాసన్ ను కలవడం తన కల అని ,అది నిజం అయిందని ఈ స్టార్ కమెడియన్ అన్నాడు. కమల్ హాసన్ కు థాంక్స్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version