కమల్ హాసన్ ‘విక్రమ్’, సూర్య గెస్ట్ రోల్‌పై కార్తి ఇంట్రెస్టింగ్ రివ్యూ

-

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. రూ.వంద కోట్ల క్లబ్ లో అతి తొందరగా చేరిన చిత్రంగా ‘విక్రమ్’ నిలిచింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపైన ‘ఖైదీ’ చిత్ర కథానాయకుడు, కార్తి రివ్యూ ఇచ్చేశాడు.

ఈ సినిమాపైన హీరో కార్తి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రేక్షకులంతా చెప్పినట్లుగా ఇది నిజమైన వేడుకని, తెరపై కమల్‌హాసన్‌ నటన చూస్తుంటే భారీ తుపాను కనిపించిందని కార్తి పేర్కొన్నారు. యాక్షన్‌, విజువల్స్‌ అన్నిటికీ పర్ఫెక్ట్‌ కనెక్షన్‌ ఉందని, ఫహద్ ఫాజిల్‌ నటనలో తన స్థాయిని ఎప్పుడూ తగ్గించుకోరని, విజయ్‌ సేతుపతి కొత్త బాడీ లాంగ్వేజ్‌లో కనిపించారని ప్రశంసించారు. అనిరుద్‌ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు.

ఇక తన అన్న సూర్య ‘రోలెక్స్’ చివరలో భయపెట్టించాడని పేర్కొన్నాడు కార్తి. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో హీరో కార్తి ‘ఖైదీ’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం తెలుగులోనూ విజయవంతమైంది. కాగా, కార్తి ప్రశంసల వర్షం కురిపించడం పట్ల సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఖైదీ-2’ చిత్రం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో చేయాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version