వినాయక చవితి.. గణపతిని ఏ సమయంలో ప్రతిష్టించాలంటే?

-

రేపు వినాయక చవితి సందర్బంగా ఊరూరా, ప్రతి గల్లీలోనూ గణపతులు కొలువుదీరుతాయి. కొందరు తమ ఇళ్లలోనూ గణపతులను కొలుస్తుంటారు. అయితే, పర్యావరణ హితం కోసం మట్టిగణపతులను ఉపయోగించాలని పర్యావరణ వేత్తలు కోరుతుండగా.. మార్కెట్లో మట్టి గణపతులతో పాటు రంగురంగుల గణనాధులు కొలువుదీరాయి. అయితే, వినాయకుడిని పూజించేవారు ఏ సమయంలో గణనాధుడిని ప్రతిష్టించాలో పండితులు సూచించారు.

ఈ ఏడాది వినాయక చవితి తిథి సెప్టెంబర్ 6,7 తేదీల్లో ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే, ధృక్ సిద్ధాంతం ప్రకారం 7వ తేదీనే (శనివారం) వినాయకచవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11.03 గంటల నుంచి1.30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభముహూర్తం ఉందని పేర్కొన్నారు. సాయంత్రం 6.22 గంటల నుంచి రాత్రి 7.30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version