పక్కింటి మహిళ లో దుస్తులపై కన్నేసిన వ్యక్తి.. చివరికి..!

-

అహ్మదాబాద్ దగ్గరలోని ఒక గ్రామం లో ఒక పెద్ద చిచ్చు రేగింది. అక్కడ జరిగిన పోట్లాటలో పదిమంది వరకు గాయాలు అయ్యాయి… 20 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీనికంతటికీ కారణం… ఓ మహిళ లో దుస్తులు చోరీకి గురవడమే. పచ్చామ్ గ్రామానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళ… తన పొరుగింటి వ్యక్తి తన లో దుస్తులు చోరీ చేస్తున్నాడని జూన్ 27న ఆరోపించింది. ఈ తంతు గత 8 నెలలుగా సాగుతోందని తెలిపింది. పెరట్లో తాడుపై ఆరేసిన లో దుస్తులు మాయం అవుతుండడం పట్ల మొదట్లో ఆమెకేమీ అర్థం కాలేదు. అందుకోసం రహస్యంగా సెల్ ఫోన్ అమర్చి, చోరీ తతంగాన్ని చిత్రీకరించినాట్లు సమాచారం. పక్కింట్లో ఉన్న ఒక వ్యక్తే తన దుస్తులు చోరీ చేస్తున్నాడని గుర్తుపట్టింది. ఆ తర్వాత రోజు అతడు ఎప్పట్లాగే లో దుస్తులు చోరీ చేసి వెళుతుండగా, అతడిని ఆ మహిళ వెంబడించింది. అతడి ఇంట్లో తన లో దుస్తులన్నీ గుర్తించి, ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. తన బండారం బయటపెట్టిందన్న కోపం తో ఆ వ్యక్తి మహిళపై దాడి చేశాడు.

మహిళ గట్టిగా అరవడంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడి వచ్చారు. ఆ వ్యక్తికి మద్దతుగా అతడి బంధువులు కూడా రంగంలోకి దిగారు. దాంతో లో దుస్తుల గొడవ కాస్తా గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. దాంతో పోలీసులు ఆ మహిళపై, ఆమె కుటుంబ సభ్యులపై…. పొరుగింటి వ్యక్తిపై, అతడి బంధువులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలతో సంబంధమున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version