ఏపీలో కిలాడీ లేడీ… ప్రియుడుతో ప్లాన్‌ ప్రకారం పెళ్లళ్లు చేసుకుంటూ !

-

గాజువాక కిలాడీ లేడీ దారుణాలు పాల్పడుతోంది. ప్రియుడుతో కలసి మోసాలు చేస్తూ మాయలేడి రేణుక సొమ్ము చేసుకుంటోంది. ప్రియుడు శ్రీనివాస్ స్కెచ్ ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటూ భర్తలకు మస్కా కొడుతోంది. తొలుత జగదీశ్ అనే వ్యక్తితో పెళ్లి చేసుకున్న రేణుక… పెళ్లి కాగానే మూడో నెల గర్భం కావడంతో అనుమానించి వదిలేశాడు ఆ భర్త. అయితే,… పుట్టిన ఆడపిల్ల ఖర్చు కంటూ లక్షలాది రూపాయలను ఫిక్సడ్ డిపాజిట్ చేయించుకుంది కిలాడీ లేడీ రేణుక.


తన పిన్ని కొడుకు ప్రసాద్ ను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాలని ప్రియుడు శ్రీనివాస్ మరోసారి స్కెచ్ వేశాడు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ తో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంది రేణుక. చివరకు ప్రేమ పేరుతో ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది రేణుక. కాపురం కోసమంటూ ప్రసాద్ తో పాటు లక్నో వెళ్లిన మాయలేడి రేణుక… జీవీఎంసీలో జాబ్ వచ్చిందంటూ ప్రసాద్ కు మస్కా కొట్టి విశాఖకు వచ్చేసింది. తన తల్లికి ఆరోగ్యం బాగా లేదంటూ వివిధ సందర్భాల్లో కోటి రూపాయల వరకు అతనికి టోపీ పెట్టింది. ఇలాగే మరో ఇద్దరిని ఈ లేడీ మోసం చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు బాధిత భర్తలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version