బ్రేకింగ్: విశాఖకు అరుదైన గౌరవం…!

-

గత కొంత కాలంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న విశాఖపట్నంకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్మార్ట్ సిటీ ఎక్స్ పో లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇంటర్ నేషనల్ స్మార్ట్ సిటీ ఎక్స్ పో అవార్డు పోటీ తుది జాబితా లో విశాఖకు చోటు దక్కింది. భారత్ నుంచి ఈ అవార్డు కోసం పోటీ ఇచ్చిన ఏకైక నగరం విశాఖ అని అధికారులు పేర్కొన్నారు. దివ్యాంగుల పిల్లల కోసం ప్రత్యేక పార్కు ను ఏర్పాటు చేయడంలో విశాఖకు గుర్తింపు దక్కింది.

దివ్యాంగుల పార్క్ కేటగిరీలో 46 దేశాల సరసన విశాఖ నిలిచింది. అభివృద్ధి విషయంలో, ప్రపంచం దృష్టిని ఆకర్షించడంలో ముందు నుంచి కూడా విశాఖ ముందు ఉంది. బెంగళూరు, ముంబై సహా అనేక నగరాల సరసన విశాఖ నిలుస్తుంది. దీనిపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version