క్రేజీ న్యూస్: డైరెక్ట్ గా ఓటిటి లోకి రానున్న విశ్వక్ సేన్ మూవీ.. !

-

నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా పేరును తీసుకువచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్.. కొత్త కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తెస్తూ ఆకట్టుకుంటున్నాడు. మొన్నీమధ్య డబుల్ రోల్ పోషించి “దాస్ కా ధమ్కీ” అంటూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. అయితే తాజాగా ఎవ్వరికీ తెలియకుండా మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు. విశ్వక్ సేన్ నటించిన తాజాగా చిత్రం “బూ”.. ఇది ఒక హారర్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, నివేద పెత్తురాజ్, మేఘా ఆకాష్ లాంటి హీరోయిన్ లు కీలక పాత్రలు పోషించారు. మాములుగా చిత్రబృందం ప్లాన్ చేసినట్లుగా థియేటర్ లలోనే విడుదల చేయాల్సింది. కానీ కొన్ని కారణాలతో బూ సినిమాను డైరెక్ట్ గా ఓ టి టి లో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంది.

ఈ మూవీని డైరెక్టర్ విజయ్ తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా మే 27 నుండి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మరి విశ్వక్ సేన్ చేస్తున్న మరో ప్రయోగానికి ప్రేక్షకులు జై కొడతారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version