‘మళ్ళీ పెళ్లి’లో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు అవి కూడా ఉంటాయి : పవిత్ర

-

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ నరేష్-పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పవిత్ర లోకేష్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్నారు. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ పెళ్లి మే 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘మళ్ళీ పెళ్లి’లో మంచి ఎంటర్ టైన్మెంట్‌తో పాటు హై ఎమోషన్స్ ఉంటాయంటోంది పవిత్రా లోకేష్. నరేష్ హీరోగా మెగా మేకర్ ఎం.ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించిన సినిమాను విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌‌పై నరేష్ స్వయంగా నిర్మించగా పవిత్ర కథానాయికగా నటించింది. ‘నా కెరీర్ ప్రారంభం నుంచి పాత్రలపై దృష్టి పెట్టాను. హీరోయిన్‌గానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నచ్చిన పాత్రలు చేసుకుంటూ వచ్చాను. అందరూ అనుకున్నట్లు ఇది బయోపిక్ కాదు. మా ఇద్దరికీ నచ్చి ఈ సినిమా చేశాం. ఇది చాలా అందమైన ప్రయాణం. రాజుగారి దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది అని తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version