కెసిఆర్ వైఖరిని నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టిన వీఆర్ఏలు

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ వీఆర్ఏలు వినూత్న నిరసన చేపట్టారు. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ లో భోనాలు, పోతురాజుల వేషధారణలో వీఆర్ఏలు నిరసన తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు వేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు వీఆర్ఏలు. గత 29 రోజులుగా తమ‌ న్యాయమైన‌ డిమాండ్లు పరిష్కరించాలని రెవెన్యూ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతున్నారు. గత 29 రోజులుగా స్పందించని ప్రభుత్వం.. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ అమ్మవారికి భోనం సమర్పించి భొనాలతో ర్యాలీ నిర్వహించారు మహిళా వీఆర్ఏలు.

పోతురాజుల‌ వేషధారణ తో తమ గళం వినిపించారు. డైరీ ఫామ్ చౌరస్తా నుండి అత్తపూర్ ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ లో పాల్గొన్నారు వందలాది మంది వీఆర్ఏలు. ప్రభుత్వం మొండి వైఖరి ఇలాగే కొనసాగిస్తే మా నిరసన కార్యక్రమాలు ఇంకా ఉదృత్తి చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షీగా ముఖ్య మంత్రి ప్రకటించిన అన్ని GO లను వెంటనే అమలు చేయాలి డిమాండ్ చేసింది వీఆర్ఏల సంఘం.

Read more RELATED
Recommended to you

Exit mobile version