అసలు విజయవాడలో రథం వెండిదేనా…?

-

దుర్గగుడి రథంపై మీడియాతో ఆలయ ఈవో సురేష్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అసలు నిజంగా అది వెండిదా..? కాదా..? దాన్ని ఊడదీసి తూకం వేసి పరిశీలించాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. నాకు వెండి రథం అని ఇచ్చారు, అది కూడా నేను చూసుకోవాలి కదా..? ఇప్పుడందుకే అన్నీ టెస్ట్ చేయిస్తున్నా అన్నారు. రథం అనేది చిన్న వస్తువు కాదు.. లాకర్ లో పెట్టి చేసేది కాదని ఆయన పేర్కొన్నారు.

సుమారు 250 కేజీల వెయిట్.. చెక్కమీద సిల్వర్ షీట్ కొట్టి తయారుచేశారని ఆయన పేర్కొన్నారు. అది 18 ఏళ్ల క్రితమే తయారైన రథం, అప్పుడున్న వెయిట్ ఇప్పుడుండదని పేర్కొన్నారు. ఇప్పుడు ఊడిన విగ్రహాల్నే అందరూ చూశారు, అవి ఎంత నల్లగా ఉన్నాయో అందరికీ తెలుసని అన్నారు. కాగా రథంకు ఉన్న సింహపు ప్రతిమలు పోయాయి అని ఆయన ఫిర్యాదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version