మేం బతికే ఉన్నాం..TRP కోసం అసత్యాలు ప్రసారం చేస్తారా? : మీడియాపై దంపతుల ఫైర్

-

ఉగ్రదాడిలో కొత్తగా పెళ్లైన జంట మరణించిందని.. ఇదే వారి ఆఖరి హనీమూన్ అని సోషల్ మీడియా, జాతీయ మీడియాల్లో ప్రసారం అవుతున్న అసత్య కథనాలపై అసలైన జంట స్పందించింది. వేరొకరి స్థానంలో తమ పేర్లను ఎందుకు వాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు.

‘TRP కోసం అసత్యాలు ప్రసారం చేస్తారా? ఆ హనీమూన్ వీడియో ఉగ్రదాడిలో చనిపోయిన IAF ఆఫీసర్‌ది కాదని..మరో జంటది.మేము బ్రతికే ఉన్నాం, ఆ వీడియో మాది, ఆ ఘటన సమయంలో మేమక్కడ లేము అని పేర్కొన్నారు.భారత మీడియా ఎలా పని చేస్తుందో మాకు అర్థం కావట్లేదంటూ వీడియోను రిలీజ్ చేశారు. కాగా, మీడియా కథనాలపై నెట్టింట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news